30.7 C
Hyderabad
April 29, 2024 04: 12 AM
Slider చిత్తూరు

ఫ్రీ షుగర్: శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఉదారత్వం

srikalahasthi 291

ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరకులతో బాటు అదనంగా చక్కెరను తన వంతు సాయంగా అందించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని చౌక ధరల దుకాణాలలో బియ్యం, పప్పు ఉచితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. నేటి ఉదయం నుంచి పంపిణీ ప్రారంభం అయింది.

అయితే బియ్యం, కందిపప్పు తో బాటు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో చక్కెర కూడా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పేద ప్రజలకు బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని అలాగే శ్రీకాళహస్తిలో నా బాధ్యతగా రేషన్ లో చక్కెర ఉచితంగా ఇవ్వాలని దానికి సంబంధించిన డబ్బు తాను ఇస్తానని అన్నారు. అలాగే  శ్రీకాళహస్తిలో సామాజిక దూరం పాటిస్తూ రేషన్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం రేషన్ పంపిణీ సక్రమంగా జరిగే విధంగా స్థానిక నాయకులను ఆదేశించారు.

Related posts

థియేటర్లలో ఆగస్టు 6 న క్షీరసాగర మథనం విడుదల

Satyam NEWS

పేదవారికి నిత్యావసరాలు పంచిన మార్కండేయ సేవా సమితి

Satyam NEWS

టెంటు… ఫ్రంట్ లేకుండా ఏం చేస్తవు సారూ?

Satyam NEWS

Leave a Comment