కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సందర్భంగా ఎంతో మంది పేదలు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ లోటును కొంత మేరకైనా తీర్చాలనే సదుద్దేశ్యంతో హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ నేడు ఉచితంగా టిఫిన్ సరఫరా చేసింది.
కాంగ్రెస్ నాయకుడు, శివలాల్ యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మహేష్ యాదవ్, టీఆర్ఎస్ నాయకుడు, టీఎన్ జీవో సంయుక్త కార్యదర్శి చందు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఒక్క ఆదివారం రోజే దాదాపుగా 200 మందికి ఉచితంగా టిఫిన్ సరఫరా చేశారు.