32.7 C
Hyderabad
April 27, 2024 02: 32 AM
Slider కృష్ణ

మోపిదేవి లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం

Mopidevi

కృష్ణా జిల్లా మండల కేంద్రమైన మోపిదేవి లోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి దేవస్థానంలో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం జరిగింది.

ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, విస్తరిస్తున్న ఈ కరోనా వైరస్ నియంత్రణ కై రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ  ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు మోపిదేవి ఆలయం లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం నిర్వహించారు.

ఆలయ ఈవో లీల కుమార్ ఈ హోమం లో పాల్గొన్నారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్ మహమ్మారి ఎక్కువగా ఉండటం వల్ల  మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్య మూల మంత్ర పాశుపత మహామృత్యుంజయ శ్రీ ధన్వంతరి సహిత నవగ్రహ హోమం నిర్వహించారు.

దేశం మొత్తం సుభిక్షంగా ఉండటానికి, మృత్యువు నుండి కాపాడుకోవడానికి, ఎటువంటి అంటురోగాలు సోకకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ హోమం నిర్వహిస్తున్నారు. 

ఆలయ ప్రధాన అర్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు వేదపండితులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఈ హోమం నిర్వహించారు.

Related posts

విజయనగరం లో శిల్పా రామంకు బస్సు..

Satyam NEWS

విశాఖలో మాజీ కార్పొరేటర్ భర్త ఆత్మహత్య

Satyam NEWS

క్షయ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం

Satyam NEWS

Leave a Comment