సిబిఐటి కళాశాల లో ఎమ్ఇ, ఎమ్ టెక్, ఎమ్ బి ఎ, మరియు ఎమ్ సి ఎ కోర్సులో ప్రవేశం పొందిన నూతన విద్యార్థులకు ఈ రోజు ఓరియెంటేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టెక్ మహీంద్రా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గ్లోబల్ హెడ్ డెలివరీ ఎక్సలెన్స్ అండ్ డెలివరీ ట్రాన్స్ఫర్మేషన్ బి.కె. మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం అని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రమశిక్షణ నిస్సందేహంగా ముఖ్యమైనది. క్రమశిక్షణ లేని జీవితం గందరగోళం గా మారుతుంది.
క్రమశిక్షణ, అన్నింటికంటే ఒక వ్యక్తిని మంచి మనిషిగా మారుస్తుంది. క్రమశిక్షణ అనేది ఒక ముఖ్యమైన లక్షణం అని మనచెప్పవచ్చు. క్రమశిక్షణ కలిగిన వ్యక్తి తన పని, కార్యకలాపాలు లేదా లక్ష్యాలపై కూడా ఎక్కువ దృష్టిని కలిగి ఉంటాడు. క్రమశిక్షణ ఒక వ్యక్తి అనేక రకాల పరధ్యానాలను నివారించడానికి అనుమతిస్తుంది. క్రమశిక్షణ నిజాయితీ భావాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. ఫలితంగా, క్రమశిక్షణ అధిక-నాణ్యత ఏకాగ్రతను ఉత్పత్తి చేస్తుంది. మానవ నెట్వర్కింగ్ అనేది ముఖాముఖి సమావేశాలు, ఫోన్ కాల్లు, ఇమెయిల్ మరియు ఇతర రకాల కమ్యూనికేషన్ల ద్వారా భౌతిక లేదా వర్చువల్ వాతావరణంలో ఇతర వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం.
ఇది వ్యక్తిగత పరస్పర చర్యలు, సంబంధాలపై ఆధారపడి ఉంటుంది. గెలుపులో సహకారం కీలకం. విద్యార్థులు స్నేహితులు, కుటుంబం, సహోద్యోగులతో నెట్వర్కింగ్ను కొనసాగించాలి. ఈ యుగంలో టెక్నాలజీ యుగం అని చెప్పవచ్చు. మనం నిత్య జీవితంలో సాంకేతికతను అందిపుచ్చుకోవాలని ఆయన అన్నారు. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సివి నరసింహులు కాలేజీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి చెప్పారు. ఎఇసి డైరెక్టర్ ప్రొఫెసర్ పబ్బోజు సురేష్ పరీక్షా విధానం గురించి తెలిపారు. ఎసిఐసి – సిబిఐటి సిఈఓ అన్నే ఎసిఐసి కార్యకలాపాల గురించి చెప్పారు. వివిధ విభాగాల సలహాదారులు మరియు ఇతర విభాగాధిపతులు ఈ సందర్భంగా మాట్లాడారు.