ములుగు జిల్లాలోని ఆంథోనీస్ హై స్కూల్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు నవోదయ పరీక్ష లో ఉత్తీర్ణులయ్యారు. ఏప్రిల్ నెలలో నవోదయ పరీక్ష నిర్వహించారు. ఆంథోనీస్ హై స్కూల్ కు చెందిన కొండేటి దీవన్ కుమార్, బండారు సాధ్వి ఈ ఘనత సాధించారు.
దీనికి సెయింట్ ఆంథోనీస్ హై స్కూల్ ములుగు పాఠశాల యాజమాన్యం హర్షం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరు విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి పాఠశాల కరస్పాండెంట్ యారవ కవిత, డైరెక్టర్లు సానికొమ్ము వెంకటప్ప రెడ్డి, బొల్లం రవి ,ఏళ్ల మధుసూదన్, పాఠశాల హెడ్ మాస్టర్ కందాల రమేష్ అభినందనలు తెలిపారు.