భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్వతీపురం లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ(TTWREIS) ఆధ్వర్యంలో ITDA పరిధిలో నూతన భావన నిర్మాణంకై తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు పరిపాలనా ఉత్తర్వులు మంజూరు చేసింది.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు.
నిరక్షరాస్యత ను సమూలంగా రూపుమపాలని తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసిందన్నారు. అందరికి విద్య అందించాలని ఇప్పటికే విద్యా వ్యవస్థలో అనేక మార్పులు చేసి, ప్రతి విద్యార్థి చదువుకునేలా పకడ్బందీగా కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
అందరికి విద్యా అందించాలని సంకల్పించిన ప్రభుత్వం గిరిజన ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరు చదువుకోవాలని నిర్ణయించింది.