Slider ఆధ్యాత్మికం

ఘనంగా శ్రీమచ్చింతామణి గణపతి నిమజ్జనం

#ganeshimmersion

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో శ్రీమచ్ఛింతామణి గణపతి నవరాత్రులు వేద,స్మార్త పాఠశాల అధ్యాపక,విద్యార్థులచే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.

తొమ్మిది రోజులు (నవరాత్రులు) ఉదయం,ప్రదోషకాల సమయంలో వేద మంత్రోచ్ఛారణలతో నిత్యం విఘ్నేశ్వరునికి షోడశోపచారాలతో పూజించి,ధూప,దీప, నైవేద్యాలు సమర్పించారు.శనివారం గణపతిని యథావిధిగా అర్చించి అనంతరం వేద,స్మార్త విద్యార్థులు, పాఠశాల అధ్యాపకులు చీమలపాటి ఫణి శర్మ ఘనాపాటి నేతృత్వంలో సామూహికంగా గణపతి హోమం సశా‌స్త్రీయంగా నిర్వహించిన పిదప పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.

నవరాత్రులు పూజలందుకున్న శ్రీమచ్చింతామణి గణపతికి మంత్రోచ్ఛారణతో ఉద్వాసన చెప్పే,అంగరంగ వైభవంగా ఊరేగింపుగా గణపతిని పవిత్ర కృష్ణానదిలో నిమజ్జనం గావించారు. ఈ కార్యక్రమంలో వేద,స్మార్త,పాఠశాల కమిటీ సభ్యులు,వేద,స్మార్త విద్యార్థులు,శ్రీ లక్ష్మీనృసింహ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం కమిటీ సభ్యులు,భక్తులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

‘ఊర్వశి’ విడుదల: ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’

Satyam NEWS

మోడీ ప్రభుత్వం మొండి చెయ్యి: రైతుల్ని ఆదుకున్న కేసీఆర్

Satyam NEWS

పబ్లిక్ పాలసీ సలహాదారుగా భాద్యత స్వీకరించిన కేఆర్ మూర్తి

Satyam NEWS

Leave a Comment