29.7 C
Hyderabad
May 2, 2024 04: 02 AM
Slider రంగారెడ్డి

ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలనే దేశం సుభీక్షం

#ganeshfestival

ఉప్పల్‌ డివిజన్‌లోని జె.వి.హెచ్‌ ఫ్రడ్స్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీరామ కాలనీలో నిర్వహిస్తున్న గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో బాగంగా మాజీ కార్పోరేటర్‌ మందముళ్ళ పరమేశ్వరరెడ్డి ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ సకల విఘ్నాలు తొలగించే ప్రదమ గణాదిపతి వినాయకుని పూజించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయన్నారు.  

ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వలన దేశం సభిక్షంగా ఉంటుందని తద్వారా ప్రజలు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారన్నారు. జె.వి.హెచ్‌ ఫ్రడ్స్‌అసోసియేషన్‌  ఉత్సవ నిర్వాహక కమిటి సభ్యులు  మందముళ్ళ పరమేశ్వరరెడ్డిని శాలువాతో సత్కరించారు.

అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో  జె.వి.హెచ్‌ ఫ్రడ్స్‌అసోసియేషన్‌ నిర్వాహకులు ఈగ శేఖర్‌, బి.శివ, జి.యశ్వంత్‌, బి.రాజు, టి.జనార్ధన్‌, డి. ప్రదీప్‌, కె.వంశీ, జి.శ్రీను, సాయి. రాము తదిరులు పాల్గొన్నారు.

Related posts

కే‌సి‌ఆర్ తోనే తెలంగాణ ప్రజలు

Murali Krishna

కరోనా పెరుగుతున్నe సీఎం కేసీఆర్ కు చీమకుట్టినట్టు లేదు…!

Satyam NEWS

హ్యాపీ పొంగల్: కుటుంబ సభ్యులతో వేడుకల్లో గవర్నర్

Satyam NEWS

Leave a Comment