11 కిలోల లడ్డును 40 వేలకు దక్కించుకున్న ప్రతాపరెడ్డి
హైదరాబాద్ లోని తెలంగాణ రిటైర్డ్ ఎన్జీవోస్ కాలని కుటుంబ సభ్యులు కాలనీలో మేళ్ల, తాళాలతో అంగరంగ వైభవంగా మనీ నగర్ మనికొండ గణనాథుడి శోభాయాత్రను నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గచ్చిబౌలి డివిజన్ తెలంగణ రిటైర్డ్ ఎన్జీవోస్ కాలని లోని నల్ల పోచమ్మ మందిరం వద్ద ఏర్పాటుచేసిన మనీ నగర్ – మనికొండ యూత్ గణనాధుని మండపం వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించిన గణపతి లడ్డు వేలం పాట జోరుగా సాగింది. మొదట కాలనీ పెద్దలు గణనాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న పసాద వితరణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఎన్జీవోస్ కాలని వాసులు ప్రతాపరెడ్డి, దామోదర్ రెడ్డిలు మొదటి నుండి వేలంలో పాల్గొన్నారు. కాలనీలో మొదటసారి జరిగిన లడ్డూ వేలం పాటలో భక్తులు పోటా పోటీగా సాగిన వేలం పాటలో 11 కిలోల లడ్డును ఎన్జీవోస్ కాలనికి చెందిన ప్రతాపరెడ్డి వేలం పాటలో 40 వేలకు లడ్డూ ను దక్కించు కున్నారు.
ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఇంతటి మంచి కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో గణేష్ ని నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మహిళలు గణనాథునికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి భక్తులు మధ్య మేళ తాళాలతో నృత్యాలు చేస్తూ గణనాధునికి ఘనంగా వీడ్కోలు పలికారు.
గణేష్ బప్పా.. మోరియా.. ఆదా లడ్డూ తేరా..! అవును.. విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం.. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎదురుచూస్తారు. ఎంత ధరైనా వెచ్చిస్తారు.లడ్డూవేలంపాటలో ప్రత్యేకతను చాటుకున్న తెలంగాణ రిటైర్డ్ ఎన్జీవోస్ కాలని కుటుంబ సభ్యుల గణేశుడు మొదటి ఏడాది భక్తుల్లో మరింత ఆసక్తిని రేకేత్తించింది. ఈ కార్యక్రమంలో కాలనీ మాజీ అధ్యక్షులు కె. రాజేందర్ రెడ్డి, అధ్యక్షులు ఎస్. విశ్వనాథ్, ఉపాధ్యక్షులు కాశీనాథ్, రామచంద్రయ్య, ఎం. ఓం రెడ్డి, టి. నరసింహారావు, జి. దామోదర్,వి. రమేష్, ఎస్. రామేశ్వరరావు కాలనీవాసులు, పిల్లలు మహిళలు, యువకులు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి