నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రధానమంత్రి టీబి ముక్తభారత్ అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలిసి శుక్రవారం పాల్గొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము టీబీ నివారణ గురించి మాట్లాడారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా, రాష్ట్ర గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డితోపాటు విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నవీన్ రెడ్డి, నరసింహారావు, శ్రీనివాసులు రెడ్డి తదితరులు హాజరయ్యారు.
next post