37.2 C
Hyderabad
April 30, 2024 14: 10 PM
Slider మెదక్

చదువుతరా? బాయికాడ పొలం పని చేస్తరా?

#Minister Harishrao

సిద్దిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం విఠలాపూర్ గ్రామ ఆనంతమ్మ కుంట కాళేశ్వరం జలాలతో నిండి, మత్తడి దూకడంతో గంగమ్మ తల్లికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ జల హారతి ఇచ్చారు. 

గ్రామంలోని మాంకాలమ్మ, పెద్దమ్మ, మాతమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహాలకు ఆవుపాలతో క్షీరాభిషేకం, గోదావరి జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. విఠలాపూర్ గ్రామస్తులందరి కళ్లలో సంతోషం. ముఖాల్లో చిరునవ్వు చూసి తృప్తిగా కడుపు నిండా భోజనం చేసినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు.

ఒకప్పుడు తాగడానికి నీళ్లు కావాలని బిందెలు అడ్డం పెట్టిన విఠలాపూర్ లో ఇవాళ ఇంత మండు టెండల్లో అంతకమ్మ కుంట మత్తడి దూకడం చూసి., ఈ చెరువు నిండగా ఎప్పుడూ చూడలేదని.. గ్రామస్తులంటే.. ఇక నుంచి ఎండి పోవడం కూడా చూడరని చెబితే.. గ్రామస్తులు సంబురాన్ని వ్యక్తం చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని ఆయన తెలిపారు.

కరోనా కష్టకాలంలో కూడా విఠలాపూర్ లో 7643 క్వింటాళ్ల ధాన్యం పండిందని, రూ.1.35 కోట్లు ధాన్యం కొనుగోళ్లు జరిగాయని మంత్రి వెల్లడించారు. మీ కాళ్లకు మట్టి అంటకుండా గ్రామంలో సీసీ రోడ్లు వేయించడం నా బాధ్యత నేను చేయిస్తా. గ్రామ యువత బాగా చదివి.. మంచి ఉద్యోగం పొందాలని, లేదంటే.. అమ్మ, బాపుతో కలిసి బాయికాడికొచ్చి కమర్షియల్ క్రాప్స్ పండించి మంచి లాభాలు గడించాలి అని మంత్రి హరీశ్ చెప్పారు.

సీజన్ పంటలు పండించాలని, సన్న రకం వడ్లు, అల్లం, మిర్చి, కూరగాయల పంటలు పండించాలని రైతులకు దిశానిర్దేశం చేశారు. మండలంలోని అన్నీ గ్రామాల్లో కుంటలు, చెక్ డ్యాములు, చెరువులు నింపుతామని మంత్రి వెల్లడించారు.

Related posts

అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్  రాయబారిగా సూర్యాపేట జిల్లా వాసి

Satyam NEWS

బిజెపి జనసేన నేతలపై విరుచుకుపడ్డ మంత్రి వెల్లంపల్లి

Satyam NEWS

డా.బి ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం నమూనా విడుదల

Bhavani

Leave a Comment