పక్కా సమాచారం అందడంతో గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు సభ్యుల ముఠాను మల్కాజ్ గిరి ఎక్సయిజ్ పోలీసులు అరెస్టు చేశారు. నేరేడ్మెట్ క్రాస్ రోడ్డు వద్ద వారిని రెడ్ హాండెడ్ గా పట్టుకుని అరెస్ట్ చేసారు. వారి వద్ద ఉన్న నుండి 140 కేజీల గంజాయి, నాలుగు వేల నగదు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును స్వాధీనం చేసుకున్నారు.
వీటి విలువ 20 లక్షల రూపాయల విలువ ఉంటుందని పోలీసులు తెలిపారు. వీరు ఈ గంజాయిని విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుండి 5 వేల రూపాయలు కిలో కి కొనుకొచ్చి బయట దీనిని 10 వేల రూపాయలకు విక్రయిస్తారని తెలిపారు.