హైదరాబాద్ అంబర్ పేట్ నియోజకవర్గంలోని గోల్నాక న్యూ బ్రిడ్జిపై, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త చెదరాలను చూసి అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తక్షణ చర్యలు తీసుకున్నారు. బ్రిడ్జి నుండి గోల్నాక చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్త, ఇతర వ్యర్ధాలను జీహెచ్ఎంసీ సిబ్బందిని పిలిచి తొలగించేలా చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రోడ్లపై, పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య నిర్వహణ చేపట్టి రోడ్లు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓహెచ్ జ్యోతిబాయి, ఎస్ఎఫ్ఐ తిరుపతి, రాంకీ సంస్థ ప్రదీప్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, అంబర్పేట