30.7 C
Hyderabad
April 29, 2024 03: 59 AM
Slider ఆధ్యాత్మికం

ఆరుద్ర మహోత్సవం నాడు జంగమదేవర్లకు అన్న వస్త్రదానాలు

#Arudra Mahotsavam

శివ భక్తులైన జంగమ దేవరలకు జనవరి 6న జరిగే ఆరుద్ర మహోత్సం (శివ ముక్కోటి) అనుసరించి జంగమ దేవరలకు అన్నదానం వస్త్రదానాలతో సమారాథన జరుగుతుందని జంగమ దేవర సమాజ సభ్యులు తెలిపారు. శ్రీ పర్వతవర్థనీ సమేత శ్రీ రామేశ్వరాలయం( పాతశివాలయం) లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గత 40 సం॥రాలనుండి జరిపే శివముక్కోటి లో శివునికి ప్రియభక్తులైనజంగమ దేవరలను సమారాథన చేస్తున్నామని కోవిడ్ ఉథృతితొ మథ్యలో శివముక్కోటి గత ఏడాది నిర్వర్తించలేకపోయామని తెలిపారు,

శుక్రవారం వేకువ ఝామున 5-45 నిముషాలనుండి ప్రారంభమౌతాయని పిదప ఆలయ ప్రదక్షిణలుంటాయని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మరియు పరిసర ప్రాంతాలలో అథికంగా ఉండే జంగమ దేవరలు అందరూ పాల్గనవలసిందిగా కోరారు. ఈ సమావేశం లో జంగమ దేవర అన్నదాన సమాజ అద్యక్షులు మేడా బదరీ నారాయణరావు జాయింట్ శక్రటరీ పెండేలసుబ్బారావు వైస్ ప్రసిడెంటు వేమూరి సుబ్బారావు శక్రటరీ P.V సుబ్బారావు ట్రజరర్ వుప్పల వరదరాజులు కార్యవర్గ సభ్యులు యక్కల మాల్యాద్రి దర్శికోటిరత్నాకర్ జంథ్యాల సుబ్రమణ్యం P.పవన్ కుమార్ రమణకుమారి ప్రభృతులు పాల్గొన్నారు.

Related posts

వాసవి క్లబ్ ఒంగోలు సిటిజెన్స్ పాదచారులకు ఓఆరెస్ డ్రింక్స్ పంపిణి

Satyam NEWS

ఎవరితోనూ సఖ్యతగా ఉండని పొన్నూరు ఎమ్మెల్యే

Satyam NEWS

ఆక్షన్:గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తి అరెస్ట్

Satyam NEWS

Leave a Comment