31.7 C
Hyderabad
May 2, 2024 08: 04 AM
Slider శ్రీకాకుళం

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ఘనంగా గిడుగు జయంతి

#patrunivalasa

శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలసలో ప్రధానోపాధ్యాయులు ఐడిబిఐ ప్రసాద్ అధ్యక్షతన గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాష ఉపాధ్యాయులు డాష్టి సుదామని, పిసిని వసంతరావు, వ్యాయామ ఉపాధ్యాయులు రాజనాల సతీష్  రాయుడు పాల్గొన్నారు. ముందుగా తెలుగు భాష ఉపాధ్యాయులు సుధామని మాట్లాడుతూ తెలుగు భాషను ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితిలో పడిందని బతికించుకోవలసిన ఆవశ్యకత ఉందని అన్నారు.

మరొక తెలుగు బాషోపాధ్యాయులు పిసిని వసంతరావు మాట్లాడుతూ విద్యార్థులకు మాతృభాషలోనే బోధన జరగాలని తెలుగు భాష మనుగడుకు కృషి చేయకుండా వారోత్సవాల వల్ల ప్రయోజనం లేదని అన్నారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతి తెలుగువాడు పాలకులు కంకణం కట్టుకోవాలని అన్నారు. అప్పుడే గిడుగు వారికి ఘనమైన నివాళి అని అన్నారు. వ్యాయామ ఉపాధ్యాయులు రాజనాల సతీష్ రాయుడు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి శారీరక మానసిక అభివృద్ధికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని విద్యార్థి దశ నుంచే క్రీడల్లో పాల్గొనాలని అన్నారు. చురుగ్గా క్రీడల్లో పాల్గోవడమే ధ్యాన్ చంద్ కు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్ధులు పాల్గొన్నారు.

Related posts

రేపటి నుంచి శ్రీశైల మహాక్షేత్రంలో స్పర్శదర్శనం

Satyam NEWS

మంత్రి కేటీఆర్ కు వేములవాడ దేవస్థానం ఆహ్వానం

Satyam NEWS

6న విజయనగరం రానున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Satyam NEWS

Leave a Comment