ప్రేమించిన వ్యక్తి పెళ్లి చేసుకోవడం లేదని మనస్థాపం చెందిన ఒక యువతి ఆత్మ హత్య చేసుకున్నది. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడ మండలం వనంపల్లి గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఒక యువతి మహేష్ అనే వ్యక్తిని ప్రేమించింది. తన ప్రేమ విషయాన్ని అతను ఎంతకూ తేల్చడం లేదు. పెళ్లి చేసుకోవడం లేదు. దాంతో ఆ అమ్మాయి తీవ్ర మనో వేదనకు గురి అయింది.
ప్రేమికుడు తనను మోసం చేశాడని భావించింది. అంతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని చనిపోయింది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. కేసు నమోదు చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. నిందితుడు మహేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది.