అన్నమయ్య జిల్లా నందలూరు లో బుధవారం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు టీడీపీ పార్టీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు లోని వైసీపీ లోని ఇరువర్గాల వారు ఒక్కరిపై ఒక్కరు సర్వే నెంబర్లతో సహా మీడియా సాక్షిగా ఆరోపణలు చేసుకున్నారని,దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో 2024 రాష్ట్రంలో అధికారంలో కి వచ్చేది తమ ప్రభుత్వమే అని,అప్పుడు భూ కబ్జాలకు అడ్డుకొని వాటిని రద్దు చేసి అర్హులైన పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు పాల్గొన్నారు
previous post