పర్యాటక ప్రాంతమైన గోవా కరోనా ఆంక్షలు అన్నీ ఎత్తేసింది. గోవా రాష్ట్రంలోకి గతంలో మాదిరిగానే ఎవరైనా వెళ్లేందుకు వీలు కల్పించారు. ఇప్పటి వరకూ కరోనా నెగెటీవ్ సర్టిఫికెట్ ఉంటేనే గోవాలోకి అనుమతించేవారు.
అంతే కాకుండా క్వారంటైన్ ఆంక్షలు కూడా ఉండేవి. ఇప్పుడు వాటిని ఎత్తేశారు.
కేంద్రం అన్ లాక్ 4 లో భాగంగా ప్రకటించిన నిర్ణయాల ప్రకారం రోడ్డు మార్గం నుంచి వచ్చిన వారు కరోనా టెస్టు చేయించుకోవాలనే నిబంధన ఎత్తేశారు.
అదే విధంగా గోవాలో బార్ లు పబ్ లు కూడా తెరిచేందుకు అనుమతిచ్చారు. కొద్ది రోజుల కిందటే పరిమిత సంఖ్యలో హోటళ్లు తెరిచారు.
గోవా ఇక మళ్లీ పర్యాటక కళను సంతరించుకోవడానికి సిద్ధం అవుతున్నది.