రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ,సంక్షేమ పధకాలు మెచ్చి రాష్ట్ర వ్యాప్తం గా వందలాది ఇతర పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు వైసీపీ పార్టీ లో చేరుతున్నారని విశాఖ ఎంపీ ఎం వి వి సత్యనారాయణ అన్నారు.
విశాఖ లోని ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త కె కె రాజు అద్వర్యం లో పార్టీ లో చేరిన తెలుగుదేశం, జనసేన తో పాటు పలు పార్టీలకు చెందిన నాయకులు ,కార్యకర్తలను పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. రానున్న జి వి ఎం సి ఎన్నికలలో అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని ఎం వి వి ధీమా వ్యక్తం చేసారు.
అనంతరం కే కే రాజు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న వ్యక్తి ముఖ్య మంత్రి జగ్మోహన్ రెడ్డి అని కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆకర్షితులై టీడీపీ కి చెందిన పలువురు నాయకులు వైసీపీ లో చేరారని తెలియజేసారు. గతం లో ఏ ముఖ్య మంత్రి చేయని విధంగా జగన్ జనరంజక పాలనా అందిస్తున్నారని అన్నారు.