ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలను, సంచార జాతుల ప్రజలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని నాగర్ కర్నూలు మాదిగ జేఏసి ఇంచార్జి బోరెల్లి సురేష్ అన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఎంతో మంది ధనవంతులే ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సామాన్య ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలన్నారు .ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కూలీలను, సంచార జాతుల ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రోజు వారిగా రెక్కాడితే డొక్కడే వలసదారులు, ప్రజలు ఎంతో మంది వున్నారు. వారి కుటుంబాలను పోసించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కనీసం రేషన్ కార్డు,బ్యాంకు అకౌంట్ లేని ఆ నిరు పేదలకు ప్రభుత్వం వెంటనే 12కిలోల బియ్యం,1500రూపాయలను అందిచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది వరకు ప్రభుత్వం ఎంతోకొంత సహాయం చేస్తానని చెప్పిందని బొరేలి సురేష్ చెప్పారు.