పల్నాడు జిల్లా నరసరావుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలలో వైసీపీ మద్దతు దారులకు షాక్ తగిలింది. వైసీపీ లీగల్ సెల్ న్యాయవాది గాలి జయప్రకాష్ ఈ ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడుగా మెదరమెట్ల నాగేశ్వరరావు గెలుపొందారు. నాగేశ్వరరావు టీడీపీ లీగల్ సెల్ మెంబెర్ గా ఉన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలుగా టి.అమూల్య,కార్యదర్శిగా అబ్బూరి ఏడుకొండలు గెలుపొందారు. నాగేశ్వరరావు గెలుపు పట్ల నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,టీడీపీ లీగల్ సెల్ అభినందనలు తెలిపింది.