29.7 C
Hyderabad
May 2, 2024 05: 55 AM
Slider

జర్నలిస్టులకు అండగా ఉంటాం: మంత్రి హరీష్ రావు

సమాజంలో ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు చేదోడుగా నిలిచి కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి.హరీష్ రావు భరోసా ఇచ్చారు.

సోమవారం సాయంత్రం బాగ్ లింగంపల్లి లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన RSN సేవా ఫౌండేషన్ మీడియా, సాహిత్య అవార్డుల ప్రదానోత్సవ సభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే తమ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుందని, ఇళ్ల స్థలాల సమస్యను కూడా త్వరలో పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తగు చర్యలు చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

పలు సందర్భాల్లో జర్నలిస్టులు వారి ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వర్తించడం అభినందనీయమని హరీష్ రావు కొనియాడారు. ముఖ్యంగా కరోనా విపత్తులో వైద్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు సమాజానికి సేవలందించారని ఆయన అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కన్నీటి గాధలను జర్నలిస్టులు వెలుగులోకి తేవడం ద్వారానే ప్రజా ప్రతినిధులుగా తాము స్పందిస్తూ వారికి చేయుతనందించ గలుగుతున్నామని ఆయన స్పష్టం చేశారు.

మానవీయ కోణంలో తమ కలాలకు పదును పెట్టి కథనాలు రాస్తున్న జర్నలిస్టులను ఎంపిక చేసి పురస్కారాలతో వారిని ఆర్.ఎస్.ఎన్ సంస్థ ప్రోత్సహించడం అభినందనీయమన్నారు.
సుప్రసిద్ధ పాత్రికేయులు డాక్టర్ కే.రామచంద్ర మూర్తి ప్రసంగిస్తూ మానవత్వం కనుమరుగుతున్న నేటి సమాజంలో మానవీయ కథనాలతో ప్రజల కన్నీళ్లు తుడిచి జర్నలిస్టులు ఉండడం శుభ పరిణామామన్నారు.

ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నేడు మీడియా యాజమాన్యాలు రాజకీయాలు, సంపన్న వర్గాలు, పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రజల కష్ట సుఖాలకు ఇవ్వడం లేదనే విమర్శలు వస్తున్న సందర్భంలో మానవీయ కథనాలను బహిర్గతం చేస్తూ ఉత్తమ జర్నలిస్టులను ఆర్.ఎస్.ఎన్ సేవా ఫౌండేషన్ సత్కరించడం శుభ సంకేతమన్నారు.

ఇంకా ఈ సభలో తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు కారం రవీందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ కార్పోరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీప్రసాద్ రావు తదితరులు ప్రసంగించగా, ఆర్.ఎస్.ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ ఆర్.సత్యనారాయణ స్వాగతోపన్యాసం చేశారు.

ఈ సందర్భంగా పలువురు ఉత్తమ జర్నలిస్టులు, కవులకు అవార్డులు అందించి మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా సత్కరించారు.

Related posts

ఏపిలో అధ:పాతాళానికి పడిపోయిన బిజెపి గ్రాఫ్

Satyam NEWS

మన్మోహన్ కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి

Satyam NEWS

స్వచ్ఛభారత్ మున్సిపల్ క్లాప్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

Satyam NEWS

Leave a Comment