అభివృద్ధి సంక్షేమమే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధ్యేయమని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి అన్నారు. ఏలూరు జిల్లా పెదవేగిలో ఏర్పాటు చేసిన పింఛన్ ల పంపిణీ కార్యక్రమంలో పింఛన్ ల మంజూరు కోసం దరఖాస్తుచేసుకున్న పండుటాకులను అబ్బయ్యచౌదరి ఆప్యాయంగా పలకరించి వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. నేరుగా వృద్ధుల దగ్గరకెళ్లి ఎం ఎల్ ఏ పలకరించడం తో వృద్ధుల మొఖాల్లో ఆనందాలు వెల్లివిరిసాయి.
మండలం లో అన్ని గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, ఆ గ్రామాలలో నివసించే బడుగు బలహీన నిరుపేద వర్గాలకు అవసరమయ్యే వృద్దాప్య పింఛన్లు, రేషన్ కార్డులు, ఉపాదికల్పన, ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య అందించే సంక్షేమ పథకాలు, నిరుపేద కుటుంబాల పిల్లలకు విద్య సౌకర్యాలు కల్పించడం వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అందించి వారి అభ్యున్నతికి వై సి పి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
గురువారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పెదవేగి మండలం లో వి వి డా గ్రామాలకు చెందిన 398 మంది అర్హులకు కి క్రొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు.అదేవిధంగా మండలం లో అర్హులైన 120 మందికి మంజూరైన కొత్త రేషన్ కార్డులను ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి చేతులమీదుగా అందజేశారు.