26.7 C
Hyderabad
May 3, 2024 08: 04 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి విద్యార్థినికి గవర్నర్ ప్రశంస

#tamilsai

కామారెడ్డి పట్టణంలోని ఆర్కే డిగ్రీ అండ్ పిజి కళాశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థి మౌనికను గవర్నర్ తమిళసై ప్రశంసించారు. గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా డిసెంబర్ 25 న పార్లమెంట్ సెంట్రల్ హాలులో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందిన ఆర్కే కళాశాల విద్యార్థిని మౌనికను నేడు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అభినందించారు. పార్లమెంటులో చక్కగా సంభాషించి తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించినందుకు కళాశాలను, మౌనికను మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, వారి బృందం కూడా ప్రత్యేకంగా మౌనికకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్కే కళాశాల సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి, చైర్మన్ భాస్కర్ రావు, కోఆర్డినేటర్ దత్తాత్రి, డీన్ నవీన్, ఆడిటర్ విజయ్ ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ సి.ఈ.ఓ.కి ముస్లిం సోదరుల ఫిర్యాదు

Satyam NEWS

ఆదివాసీ మహిళ పై గిరిజనేతరుడి అత్యాచారయత్నం

Satyam NEWS

కోట్లు కూడబెట్టిన కల్కీ అవతారం

Satyam NEWS

Leave a Comment