గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా డాక్టర్ పండుల రవీంద్రబాబు , ఎం.జకియా ఖానమ్ లు నియమితులయ్యారు. మంగళవారం వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ మంగళవారం గెజిట్ విడుదల చేశారు. పండుల రవీంద్ర గతంలో అమలాపురం తెదేపా ఎంపీగా ఎన్నిక అయ్యారు.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అపుడే ఆయన అమలాపురం సీటు ఆశించారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ గా నియామకం అయ్యారు. కడప జిల్లా రాయచోటి దివంగత మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అజహర్ అలీఖాన్ సతీమణి జకీయా ఖాన మ్ మరో ఎమ్మెల్సీ గా గవర్నర్ కోటాలో నియామకం అయ్యారు.