29.7 C
Hyderabad
May 2, 2024 06: 34 AM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్సీలుగా పండుల రవీంద్రబాబు, జకియా ఖానమ్

#New MLCs

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా డాక్టర్ పండుల రవీంద్రబాబు ,  ఎం.జకియా ఖానమ్ లు నియమితులయ్యారు. మంగళవారం వీరిద్దరినీ ఎమ్మెల్సీలుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ మంగళవారం గెజిట్ విడుదల చేశారు. పండుల రవీంద్ర గతంలో  అమలాపురం తెదేపా ఎంపీగా ఎన్నిక అయ్యారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అపుడే ఆయన అమలాపురం సీటు ఆశించారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తానని వై ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ గా నియామకం అయ్యారు. కడప జిల్లా రాయచోటి   దివంగత మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అజహర్ అలీఖాన్  సతీమణి జకీయా ఖాన మ్ మరో ఎమ్మెల్సీ గా గవర్నర్ కోటాలో నియామకం అయ్యారు.

Related posts

నిరుపేద కుటుంబానికి చేయూత సాయం అందించిన తస్లీమా

Bhavani

లా కారిడార్: హైకోర్టులో జగన్ సర్కార్ పిల్లిమొగ్గ

Satyam NEWS

హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment