ములుగు జిల్లాలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీసుధీర్, జెడ్పీటీసీ సకినల భవాని తమ ఓటు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్బంగా ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు కెసిఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నారని అన్నారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ములుగు తెరాస సత్తా చాటాలని, అందుకు పట్టభద్రులు తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
ములుగు జిల్లా కో ఆర్డినేటర్ పోరిక గోవింద్ నాయక్, ములుగు మండల పట్టభద్రుల ఓటు నమోదు మండల ఇంచార్జి మస్రగని వినయ్ కుమార్ 2000 పట్టభద్రుల ఓటు నమోదు ఫారాలను ఎమ్మార్వో కు సమర్పించారు.
టిఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని మండల ఇన్చార్జి మస్రగని వినయ్ కుమార్ ఎంపీపీ గండ్ర కోట శ్రీదేవీ సుధీర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి కుమారి సకినాల భవాని, మండల అధ్యక్షులు బాదం ప్రవీణ్ కుమార్, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు పోరిక విజయ్ రామ్ నాయక్,
ములుగు జిల్లా నాయకులు గండ్ర కోట సుధీర్, గడ్డమీది భాస్కర్, మహేందర్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.