గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని అర్హులైన వారు తక్షణమే ఉపయోగించుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.
నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు అందరూ తొలిరోజే తమ ఓట్లను, తమ కుటుంబ సభ్యుల ఓట్లను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
తాను కూడా ఓటు నమోదు చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉదయం 10 గంటలకు తాను ఓటు నమోదు చేయించుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీ ల నుండి మొదటి రోజు కనీసం 20 అప్లికేషన్ ల చొప్పున గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చెయ్యాలని ఆయన కోరారు.