రోడ్డు ప్రమాదంలో గాయపడినవారిని ఆదుకుని ములుగు పోలీసులు మానవత్వం చాటుకున్నారు. పందికుంట స్టేజి మల్లంపల్లి మధ్య మూల మలుపు వద్ద ఒక కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కి చెందిన మేడిశెట్టి సారంగ పాణి, చందర్, ప్రతిమలు తీవ్ర గాయాల పాలయ్యారు. వారంతా పాలంపేట రామప్ప సందర్శన కి వచ్చి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఖమ్మం సభకు బందోబస్తు డ్యూటీలో అటుగా వెళ్తున్న వెంకటాపూర్ ఎస్సై తాజుద్దీన్, ములుగు ఎస్సై పవన్ లకు ఈ దృశ్యం కనిపించింది. తమ డ్యూటీ కాకపోయినా వారు వెంటనే స్పందించి క్షతగాత్రులను కారులో నుంచి బయటికి తీసి 108 సహాయంతో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
previous post
next post