ముస్లిం మైనారిటీలకు ఖబరస్తాన్ స్థలం చూపించడమే కాకుండా అందులో సౌకర్యాలు కల్పిస్తున్న అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు ముస్లిం సోదరులు ధన్యవాదాలు తెలిపారు. అంబర్ పేట డివిజన్ లో ఎస్టీపీ వాటర్ వర్క్స్ వెనుక భాగంలో ముస్లిం మైనార్టీలకు ఖబరస్తాన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉన్నది. ఈ 3 ఎకరాల స్థలాన్ని వాటర్ వర్క్స్ అధికారులు జిహెచ్ఎంసి అధికారులకు అందచేసి ముస్లింల డిమాండ్ కు సహకరించారు. దాంతో ఆ ప్రాంతంలోని ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబర్పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ నేడు ముస్లిం పెద్దలతో కలిసి వెళ్లి నేడు ఆ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు కార్పొరేటర్ వెంట పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చొరవ తో త్వరితగతిన పనులను పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబర్పేట్ డివిజన్ ముస్లిం సోదరులు, మజీద్ కమిటీ వారు, తదితరులు పాల్గొన్నారు.