39.2 C
Hyderabad
April 28, 2024 14: 45 PM
Slider ముఖ్యంశాలు

పెండింగ్ స్కాలర్‌షిప్ లు, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి

#sfimulugu

పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని  ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ డిమాండ్ చేశారు. సోమవారం  ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి భారత విద్యార్థి సమైక్య ఎస్ఎఫ్ఎస్ఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం  కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ కార్యాలయ ఏఓ శ్యాం కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుమ్మరి సాగర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ , ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని నూతనంగా ఏర్పడిన గురుకులాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలలో అధిక ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్ఎంహెచ్ బాయ్స్, గర్ల్స్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీ త్వరగా పూర్తి చేసి క్లాసులు నిర్వహించాలని అన్నారు. ఆశ్రమ పాఠశాలలో ఏఎన్ఎం పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాలుగు గణేష్, నరిగే రాజుకుమార్, పాషా, మోహన్, వినోద్, ప్రవీణ్, వేణు, ప్రవళిక, సంగీత, మౌనిక, రజిత, శిరీష తోపాటు 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

ఎన్టీఆర్ పేరు తొలగింపు తెలుగు జాతికే అవమానం

Satyam NEWS

మావోయిస్టు రహిత తెలంగాణే పోలీసుల లక్ష్యం

Murali Krishna

పోలీసు ఉద్యోగార్ధులకు శారీరక దృఢత్వ శిక్షణ కేంద్రంలో పాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment