26.7 C
Hyderabad
May 3, 2024 08: 19 AM
Slider ఆదిలాబాద్

ప్రజా సమస్యలను వారం రోజుల్లోగా పరిష్కరించాలి

adb collector

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారుఖీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ సెల్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు.

నిర్మల్ పట్టణం బుధవారపేట కు చెందిన లింగంపల్లి భారతి గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదని, లక్ష్మణాచాంద మండలం బొరిగాం  గ్రామానికి చెందిన బత్తుల మల్లవ్వ ప్రభుత్వ ఆస్పత్రిలో చేసుకున్నందున ఆర్థిక సాయం అందించాలని, లోకేశ్వరం మండల పరిధిలో ఆర్అండ్ బి రోడ్డు వెడల్పుకు భూముల ఇచ్చినందుకు నష్టపరిహారం మంజూరు చేయాలని, బైంసా కు చెందిన వినోద్ కుమార్ వ్యవసాయ భూములను రికార్డులలో కంప్యూటరీకరణ చేయాలని కోరారు.

లక్ష్మణ్చందా మండలం వద్యాల్ కు చెందిన ఆఇండ్ల గంగవ్వ వితంతు పింఛన్ ఇప్పించాలని కోరగా సంబంధిత అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, ఆర్డీవో ప్రసూనాంబ, జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో కరీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

శాల్యూట్ డాడీ: నాన్నకు ప్రేమతో…..:

Satyam NEWS

కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

ప్రధాని కరుణా కటాక్షం ఈ సారి లభించేనా?

Satyam NEWS

Leave a Comment