తెలంగాణ కుంభమేళ శ్రీ సమ్మక్క – సారలమ్మల మహాజాతర సందర్భంగా తెలంగాణ పర్యాటక శాఖ అధ్వర్యంలో భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ బేగం పేట విమానాశ్రయం నుండి మేడారం కు హెలికాప్టర్ సేవలను రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంబించారు. ఈ టూరిజం ప్యాకేజీ లో భాగంగా బేగంపేట ఎయిర్ పోర్టు నుండి మేడారం, మేడారం నుండి హైదరాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్టు వరకు నిర్వహిస్తున్నామన్నారు.
హైదరాబాద్ నుండి 6 గురు ప్రయాణికులకు 1లక్ష 80 వేలు తో పాటు జి యస్ టి (1.80.000 + జి యస్ టి) ఉంటుందన్నారు. వీటితో పాటు మేడారం జాతర వ్యూ హెలిక్యాప్టర్ నుండి చూసేందుకు ప్రతి ప్రయాణికుడికి 2999.00 నామ మాత్రపు చార్జీ తో అవకాశం కల్పిస్తారు. పర్యాటకులు హెలిక్యాప్టర్ సదుపాయం ను ఉపయోగించుకోవటానికి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 94003 99999. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, టూరిజం చైర్మన్ భూపతి రెడ్డి, రాష్ట్ర పౌర విమానయాన శాఖ డైరెక్టర్ భరత్ రెడ్డి, టూరిజం MD మనోహర్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.