33.7 C
Hyderabad
April 29, 2024 02: 32 AM
Slider సినిమా

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన మిస్ ఫెమినా శ్రేయా

#Ms Femena India

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా రన్నర్ అప్- శ్రేయా రావు కూకట్ పల్లి లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. యువ నటి సిమ్రాన్ చౌదరి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.

ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు  జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు, తనతో పాటు ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న వారికి, ప్రముఖులకు మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు.

వారిలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ , నటి మానుషీ చిల్లర్ , ఆర్టిస్ట్ శ్రీనిధి శెట్టి, యాక్టర్ ఆశా భట్,  మ్యూజీషియన్ , సింగర్ బెహ్రమ్ సిగన్పోరియ, మిష్టర్ చాంగ్, మీనాక్షీ చౌదరి, యాక్టర్ ప్రియ, ప్రముఖ మోడల్ రోష్ని షెరోన్, గాయత్రి భరద్వాజ్ , నేహాల్ చూధాస్మా , స్టెఫీ పాటిల్, షెఫాలిసూద్ , భావనా దుర్గం , నికితా శర్మ ఉన్నారు.

Related posts

బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడుగా చంద్రశేఖర్

Satyam NEWS

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు కరోనా పాజిటీవ్

Satyam NEWS

జయహో భారత్: మా దేశ భక్తి ముందు కరోనా తల వంచాల్సిందే

Satyam NEWS

Leave a Comment