గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఫెమినా మిస్ ఇండియా రన్నర్ అప్- శ్రేయా రావు కూకట్ పల్లి లోని తన నివాసంలో మూడు మొక్కలు నాటారు. యువ నటి సిమ్రాన్ చౌదరి ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించిన తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు.
ఇంతటి పవిత్ర కార్యాన్ని నిర్వహిస్తున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు, తనతో పాటు ఫెమినా మిస్ ఇండియా పోటీలో పాల్గొన్న వారికి, ప్రముఖులకు మూడు మొక్కలు నాటమని ఛాలెంజ్ చేశారు.
వారిలో ప్రముఖ హీరో సందీప్ కిషన్ , నటి మానుషీ చిల్లర్ , ఆర్టిస్ట్ శ్రీనిధి శెట్టి, యాక్టర్ ఆశా భట్, మ్యూజీషియన్ , సింగర్ బెహ్రమ్ సిగన్పోరియ, మిష్టర్ చాంగ్, మీనాక్షీ చౌదరి, యాక్టర్ ప్రియ, ప్రముఖ మోడల్ రోష్ని షెరోన్, గాయత్రి భరద్వాజ్ , నేహాల్ చూధాస్మా , స్టెఫీ పాటిల్, షెఫాలిసూద్ , భావనా దుర్గం , నికితా శర్మ ఉన్నారు.