36.2 C
Hyderabad
April 27, 2024 21: 51 PM
Slider నిజామాబాద్

గెస్ట్ విత్ చెక్: పెళ్లి పందిట్లోనే కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

kalyana laxmi

కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో మార్కంటి దీపిక పెళ్లి యాదగిరితో జరుగుతోంది. ఇంతలో పెళ్లికి అనుకోని అతిథి హాజరయ్యారు. అది ఎవరో కాదు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన నిట్టు జాహ్నవి. దీపిక పెళ్లి కుదరగానే కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. అది పెళ్లి సమయానికి మజూరైంది. మంజూరైన లక్ష నూట పదహారు రూపాయల చెక్కును స్వయంగా పెళ్లి పందిట్లోనే వదువుకు అందజేయాలని మున్సిపల్ చైర్మన్ అక్కడికి వెళ్లారు. వేద మంత్రాల సాక్షిగా, బంధువుల సమక్షంలో ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కును పెళ్లి కూతురుకు అందజేశారు. దాంతో పేలింత సంతోషం మరింత రెట్టింపయింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్ రావు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

స్మార్ట్ పేరుతో జగన్ రెడ్డి దగా: ఏపి కాంగ్రెస్

Satyam NEWS

అధికార పార్టీ మంత్రుల ధాన్యం దోపిడి

Satyam NEWS

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Satyam NEWS

Leave a Comment