కామారెడ్డి పట్టణంలోని వాంబే కాలనీలో మార్కంటి దీపిక పెళ్లి యాదగిరితో జరుగుతోంది. ఇంతలో పెళ్లికి అనుకోని అతిథి హాజరయ్యారు. అది ఎవరో కాదు. ఇటీవల మున్సిపల్ చైర్మన్ గా నూతనంగా ఎన్నికైన నిట్టు జాహ్నవి. దీపిక పెళ్లి కుదరగానే కళ్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేశారు. అది పెళ్లి సమయానికి మజూరైంది. మంజూరైన లక్ష నూట పదహారు రూపాయల చెక్కును స్వయంగా పెళ్లి పందిట్లోనే వదువుకు అందజేయాలని మున్సిపల్ చైర్మన్ అక్కడికి వెళ్లారు. వేద మంత్రాల సాక్షిగా, బంధువుల సమక్షంలో ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కును పెళ్లి కూతురుకు అందజేశారు. దాంతో పేలింత సంతోషం మరింత రెట్టింపయింది. ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు, బల్వంత్ రావు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
previous post