జుక్కల్ శాసనసభ్యులు హనుమంత్ షిండే ఆధ్వర్యంలో మద్నూర్ మండల కేంద్రంలో కార్యకర్తల విస్తృస్థాయి సమీక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నోసంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని అందులో ముఖ్యంగా కళ్యాణలక్ష్మి షాదీముబారక్ లతోపాటు ఆసరా పెన్షన్లు నిరుపేద కుటుంబాలకు ఆదుకుంటున్నాయన్నారు. మండలంలోని గ్రామాల అధ్యక్షులు, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలన్నారు. విపక్ష పార్టీలు చేస్తున్నఆరోపణలకు అక్కడికక్కడే సమాధానం చెప్పే విధంగా ప్రజలకు అర్థమయ్యేలా తెలియజేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లోనూ తెరాస ప్రభంజనం ఉండేలా గ్రామస్థాయిలో కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ లక్ష్మీబాయి, జెడ్పీటీసీ అనిత, తెరాస అధ్యక్షులు సంగమేశ్వర్ సొసైటీ చైర్మన్ శ్రీనుపటేల్, ఎన్డీసీసీ బ్యాంక్ డైరక్టర్ రామ్ పటేల్, మద్నూర్ సర్పంచ్ సురేష్తో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఉన్నారు.
previous post