ఐజీ రంగారావు హెడ్ క్వార్టర్ కు బదిలీ..
విశాఖ పోలీస్ రేంజ్ కొత్త డీఐజీగా ఎస్.హరికృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఈయన మంగళగిరిలోని సీఐడీ విభాగపు డీఐజీగా పని చేసారు. ఇటీవలే కొత్త జిల్లా ఏర్పాటు..అలాగే వాటికి కొత్తగా కలెక్టర్లు,ఎస్పీలను జగన్ ప్రభుత్వం నియమించింది.
దీంతో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పలు కీలక పోస్టులలో అధికారులను నియమించింది. అందులో భాగంగానే విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీగా హరికృష్ణను నియమించింది..రాష్ట్ర ప్రభుత్వం. ఇంతవరకు ఉన్న రేంజ్ డీఐజీ రంగారావు ఐజీగా పదోన్నతి వచ్చింది.
అలాగే తాత్కాలింగా రేంజ్ డీఐజీగా కూడా బాధ్యతలు నిర్వహించడం జరగింది. అయితే విశాఖ రేంజ్ డీఐజీగా హరికృష్ణను ప్రభుత్వం నియమించడమే కాక..ఐజీ రంగారావు హెడ్ క్వార్టర్ కు బదిలీ చేసింది. ఇక హరికృష్ణ…విశాఖ పోలీస్ రేంజ్ డీఐజీగా రెండు రోజుల క్రితమే బాధ్యతలు స్వీకరించారు.
కాగా రాష్ట్రంలో అనంతపురానికి చెందిన హరికృష్ణ బీటెక్,ఎంబీఏ పూర్తి చేసారు. 2006 బ్యాచ్ ఐపీఎస్ చెందిన హరికృష్ణ విజయవాడ కమిషన్ రేట్ లో డీసీపీ (పరిపాలన)గా పనిచేస్తూ 2020 మార్చి 7న డీఐజీగా పదోన్నతి పొందారు.