ఎక్కడ నుంచి ఎక్కడికి వెళుతున్నాయో కానీ కొత్త కొత్త నోట్ల కట్టలు హైదరాబాద్ పోలీసుల కంట పడ్డాయి. హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా హవాలా డబ్బును పట్టుకున్నారు.
మొత్తం కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా దుబ్బాక కు హవాలా మార్గంలో తరలి వెళ్తున్నాయని అనుమానిస్తున్నారు. బిజెపి దుబ్బాక ఏం ఎల్ ఏ అభ్యర్థి రఘునందన్ రావు కు సంబంధించిన వ్యక్తిని ఈ సందర్భంగా పోలీసులు అరెస్టు చేశారు.