39.2 C
Hyderabad
April 28, 2024 11: 24 AM
Slider ప్రకాశం

మద్యం మత్తులో విద్యార్ధుల్ని హింసిస్తున్న హెడ్మాస్టర్

#prakasham

మద్యం మత్తులో ఉండే ఒక హెడ్ మాస్టర్ విద్యార్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. ఈ దారుణమైన సంఘటన ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలంలో జరిగింది. హెడ్ మాస్టర్ తీరుపై గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు నేడు ఆందోళన వ్యక్తం చేశారు. హెడ్ మాస్టర్ తీరు దారుణం అంటున్న పలువురు గ్రామస్తులు పాఠశాలకు బయట గేటు వేసి ఆందోళన చేశారు.

హెడ్ మాస్టర్ తీరు అభ్యంతరకరంగా ఉందని అందువల్ల అతడిని విధుల నుండి తొలగించాలని ఆందోళన చేశారు. గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం మద్యం మత్తులో విద్యార్థులపై దాష్టికం ప్రదర్శిస్తున్నాడని, ప్రధానోపాధ్యాయుడు ఆ పదవికి అనర్హుడని అంటున్నారు. స్కూల్ లో విద్యార్థుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్న హెడ్ మాస్టర్ ను తీసేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ముగ్గురు గాజులపల్లి విద్యార్థులను అతను కొట్టాడని తెలిపారు.

హెడ్ మాస్టర్ పై ఆరోపణలు చెప్పుకోలేని స్థితిలో విద్యార్థులు ఉన్నారని అంటున్నారు. ఇటీవల నాగంపల్లి ఎం.పీ.యు.పీ పాఠశాలలో ఎనిమిదోవ  తరగతి చదువుతున్న విద్యార్థిని మద్యం మత్తులో చితకబాదాడు ఈ హెడ్ మాస్టర్. గాయంతో అక్కడికక్కడే స్పహ కోల్పోయిన విద్యార్థిని హుటాహుటిన గొట్లగట్టులోని ప్రయివేట్ హాస్పిటల్ కు తరలించారు. సంబంధించిన ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన షరా మాములే అన్నట్లు పరిస్థితి ఉందని వారు అంటున్నారు.

Related posts

శిక్షణా మైదానాన్ని సందర్శించిన ఎస్పీ

Murali Krishna

ఎక్సోడస్: వైసీపీ లోకి సతీశ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

బేతపూడిలో రైతులు రైతు కూలీల‌ నిరసన

Sub Editor

Leave a Comment