సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన కడప జిల్లాలో ప్రతిపక్ష టీడీపీ కి భారీ గండి పడింది. టీడీపీ లోని బడా నేతల కోసం వైసీపి గాలం వేసింది. పులివెందల ప్రాంతానికి పెద్ద దిక్కుగా ఉంటున్న టీడీపీ నేత, మండలి మాజీ డిప్యూటీ చైర్ పర్సన్ సతీశ్ కుమార్ రెడ్డి వైసీపీ లో చేరనున్నారు.
ఈ నెల 13 న తాడేపల్లి నివాసం లో జగన్ సమక్షంలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయ్యింది. ఇద్దరు ముఖ్యమంత్రుల పై నాలుగు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సతీశ్ రెడ్డి, గతంలో దివంగత వైఎస్సార్ పై రెండు మార్లు జగన్ పై రెండు సార్లు టీడీపీ అభ్యర్టిగా పోటీ చేసారు. టీడీపీ కోసం సుధీర్ఘ కాలం పులివెందల నుంచి పనిచేసిన సతీశ్ రెడ్డి గడచిన కొంతకాలం గా స్తబ్దుగా ఉన్నారు.
వర్గీయుల అందరి అభిప్రాయం మేరకే వైసీపీ లోకి సతీశ్ రెడ్డి చేరుతున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ ఇతర కుటుంబ సభ్యులతో మంతనాలు పూర్తయ్యాయి. రేపు మంగళవారం వేంపల్లిలో ముఖ్య అనుచరులు కార్యకర్తలతో సతీష్ రెడ్డి సమావేశంలో కానున్నారు.