31.7 C
Hyderabad
May 2, 2024 07: 53 AM
Slider హైదరాబాద్

మహిళా వైద్య సిబ్బందికి సన్మానం

కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి రోగులకు సేవ చేసిన డాక్టర్లను, నర్సులను అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అరుణ్ ప్రజా సేవ సదన్ సన్మానించింది.

అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని హైదరాబాద్ బాగ్ అంబర్ పేట్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించారు.

కోవిడ్ సందర్భంగా తమ ప్రాణాలకు తెగించి సేవలందించిన డాక్టర్లను నర్సులను  సన్మానించి కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్ పద్మా వెంక రెడ్డి డాక్టర్ గీత సేవా సమితి సభ్యులు అనెం బాలరాజు, మల్లేష్, రాజేష్ నేత రామకృష్ణ గౌడ్ శేఖర్, శీను ,నర్సింగ్, పాల్గొన్నారు

Related posts

పేట మునిసిపాలిటీకి రామచంద్రారెడ్డి

Satyam NEWS

‘వారాహి’ వాహనం పై అభ్యంతరం లేదు 

Murali Krishna

టెట్ విషాదం: పరీక్ష హాల్ లో గర్భవతి మృతి

Satyam NEWS

Leave a Comment