ఇంటి బయటకు వెళితే కరోనా మూలంగా చస్తారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్న తరుణంలో ఇంట్లో ఉన్న కుర్రాడు వర్షం పడడంతో మిద్దె పైకి వర్షం నీరు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో దురదృష్టవశాత్తు ఇంటి పక్కనే పిడుగు పడడంతో ఆ యువకుడు మృతి చెందిన సంఘటన పుల్లంపేట పేటలో జరిగింది.
కడప జిల్లా పుల్లంపేట మండలం ఎగువరెడ్డిపల్లె లో సోమవారం సాయంత్రం పిడుగు పడి డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి చవ్వాకుల థనుష్ (20)మృతి చెందాడు. ఇంటిపై వర్షపునీరు నిలబడడంతో మిద్దె పైకి వెళ్ళిన సమయంలో ఇంటి పక్కనే పిడుగు పడటంతో అక్కడికక్కడే థనుష్ మృతి చెందాడు.
మృతుడు థనుష్ డిగ్రీ రెండవ సంవత్సరం రాజంపేట లో ని వైష్ణవి డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. తండ్రి చెంగల రాయుడు తల్లి సుబ్బరత్నమ్మ లకు ముగ్గురు మగ పిల్లలు కాగా మొదటి అబ్బాయి థనుష్ మృతి చెందడం తో ఇంటిల్లి పాది శోక సంద్రం లో మునిగి పోయింది.