హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్టలో దారుణం జరిగింది. ఒక మైనర్ బాలికపై ఎంఎస్ మక్తా లో పంచర్ షాప్ నడిపే ఒకడు గత పది రోజులుగా అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. బాలిక తండ్రి వాచ్ మెన్ గా పని చేస్తుంటాడు. తల్లి ఇళ్ళల్లో పనిచేస్తూ, ప్రతిరోజు ఉదయం పూట పాల ప్యాకెట్లు వేసి, సాయంత్రం డబ్బును వసూలు చేసుకునేవారు. పేద కుటుంబం. వారి ఇంటి పక్కనే జహంగీర్ అనే వ్యక్తి ఉంటాడు.
సాయంత్రం పూట తల్లిదండ్రులు లేని సమయంలో ఈ కామాంధుడు , బాలికకు మాయమాటలు చెప్పి గత పది రోజులుగా ఆమెపై అత్యాచారం చేస్తున్నాడు. సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికి రాగానే నీరసంగా కూర్చుని ఉన్న ఆ బాలికను చూసి ఏమైందమ్మా అని తల్లి అడిగింది. ఆ బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని తల్లికి చెప్పింది. వెంటనే తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో జరిగిన ఘోరం పై ఫిర్యాదు చేశారు. జహంగీర్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.