ముఖ్య అతిథిగా హాజరైన త్రిదిండి దేవానంద జీయర్ స్వామి
శ్రీ కుమరన్ తంగమాలిగై చెన్నై సిల్క్స్ అధినేత ఆర్ముగం వై జంక్షన్ వారు నిర్వహించిన శ్రీనివాస కల్యాణం శనివారం సంస్థ కార్యాలయంలో కన్నుల పండుగగా జరిగింది. వందలాదిగా భక్తజనం హాజరై స్వామి అమ్మవారి కల్యాణాన్ని కనులారా తిలకించారు. వేద మంత్రోచ్చోరణాల మధ్య అంగరంగ వైభవంగా సాగిన శ్రీనివాసుని కన్యాదానం,వ్మాంగళ్య హారతి, మంగళ సూత్ర ధారణ, మహా హారతిని భక్తులు తనివితీరా తిలకించి స్వామి వారి ఆశీర్వాదాలు పొందారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ త్రిదిండి దేవానంద జీయర్ స్వామి కళ్యాణానంతరం ప్రవచనాలు చేశారు. స్వామివారి కల్యాణ విశిష్టతను, మహిమళను విన్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. కల్యాణం తదుపరి స్వామివారి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
అనంతరం శ్రీ త్రిదిండి దేవానంద జీయర్ స్వామి మాట్లాడుతూ. శనివారం శ్రీనివాస్ నికి ఇష్టమైన వారమని ఇదే రోజున చెన్నయ్ సిల్క్స్ అధినేత ఆర్ముగం శ్రీనివాసుడి కల్యాణం జరిపించడం శుభప్రదమన్నారు. స్వామివారి దయా, కరుణా కటాక్షాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, కరోనా లాంటి వ్యాధులు తొలగిపోయి ప్రజలంతా శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆ శ్రీనివాసుడిని కోరుకుంటున్నానని అన్నారు.
ఆర్ముగం నేతృత్వంలో నూతన వధూవరుల కోసం స్వయంవరం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారని, దాంపత్య జీవితాలు కలకాలం నిలవాలనే సంకల్పంతో చేపట్టిన స్వయంవరం కార్యక్రమం సఫలీకృతం కావాలని, సాంప్రదాయాలకు విలువనిచ్చే ఆర్ముగం సంకల్పం నెరవేరాలని శ్రీ త్రిదిండి దేవానంద జీయర్ స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కుమరన్ తంగమాలిగై చెన్నై సిల్క్స్ అధినేత ఆర్ముగం, వై జంక్షన్ ఇంఛార్జ్ దంపతులు, చెన్నయ్ సిల్క్స్ సిబ్బంది, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం న్యూస్, కూకట్ పల్లి