కూకట్ పల్లి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాను అందరి ముందు ముసపెట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ అవమానించారు.
జెఎన్టియు యూనివర్సిటీ లోని జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా పాసుల ఈ విషయంలో జర్నలిస్ట్ పై దురుసుగా ప్రవర్తిస్తూ మీరూ జర్నలిస్ట్ లేనా అంటూ హేళన చేశారు.
30 మందికే పాసులు ఇస్తామంటూ మిగతా వాళ్ళకి ఇవ్వమని అసలు మీరు జర్నలిస్టా? మీరు జర్నలిజం చేశారా అంటూ అందరి ముందు అవమానించారు.
సినిమా టిక్కెట్ల కు ఎగబడ్డట్టు నిలబడతారా అంటూ మీడియా ప్రతినిధులకు వెటకారంగా మాట్లాడారు.
దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు సినిమా టికెట్లు కోసం ఎగబడ్డట్టు ఎలా అంటారు అంటూ అని డీసీ నిలదీయడంతో నీళ్లు నెమలి తోక ముడిచారు.
మీడియాను అవమానిస్తే ఎన్నికల కవరేజ్ ను బాయ్ కాట్ చేస్తామని హెచ్చరించడం తో సాయంత్రం అందరికీ పాసులు ఇస్తామని Dc రవికుమార్ అనడంతో వాగ్వివాదం సద్దుమణిగింది.
అనంతరం సర్దుబాటు ధోరణి లో వ్యవరిస్తూ త్వరగా పాసులకు ఏర్పాటు చేయండి అని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.