కుల వృత్తుల ప్రోత్సాహానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. సోమవారం ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి డివిజన్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కుషాయిగూడ దోబి ఘాట్ లో అధునాతన యంత్ర యూనిట్ల ప్రారం భోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుల సంఘాలకు సామాజిక భవనాలు, కుల వృత్తుల ప్రోత్సాహానికి చేయూతనిస్తున్నారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు స్వర్ణ రాజ్ ,సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ,బన్నాల గీత ప్రవీణ్ ,మాజీ కార్పొరేటర్లు గోల్లురి అంజయ్య ,మేకల హన్మంతు రెడ్డి ,గోపు సదానంద్ ,నాయకులు నందికొండ శ్రీనివాస్ రెడ్డి ,డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి