హిందువుల పట్ల ప్రభుత్వనిర్లక్ష్య చర్యలకు నిరసనగా హుజుర్ నగర్ లో హిందువులు నల్ల జెండాలు ధరించి నిరసన తెలియశారు. ఈ నిరసనలో భాగంగా హుజుర్ నగర్ భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు ముస్కుల చంద్రారెడ్డి మాట్లాడుతూ భయంకర హిందువుగా చెప్పుకునే కేసీఆర్ గత సంవత్సర కాలంగా హిందువులపై చేసే కుట్రలు అంతా ఇంతా కాదని అన్నారు.
ఒక్క మత వర్గానికి మాత్రమే తొత్తుగా పనిచేస్తూ హిందూ ధర్మాన్ని, హిందూ పండుగలను తుంగలో తొక్కడానికి కంకణం కట్టుకున్నారని అన్నారు. హిందూ పండగల్లో అత్యంత ఘనంగా 9 రోజులు నిర్వహించే వినాయక చవితి నవరాత్రులని జరుపుకోకుండా కేసీఆర్, ఆయన భజన బృందం కుట్రలు పన్ని హిందువులను చాలా ఇబ్బందులకు గురి చేశారని వారన్నారు.
విశ్వ హిందూ పరిషత్ వారు హైకోర్టు నుండి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ గణపతి నవరాత్రులు జరుపుకోవచ్చని పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని వారన్నారు.
ఈ నిర్లక్ష్య వైఖరి హిందువులపై చిన్నచూపు ఎందుకని వారు ప్రశ్నించారు. ప్రజలు నీచమైన మత రాజకీయాలు అన్ని గమనిస్తూనే ఉన్నారని, ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజు ముందుందని అన్నారు. ఈ కార్యక్రమం లో హుజూర్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు వల్లపుదాసు గోపీనాథ్ గౌడ్, దెనుమకొండ రామరాజు, పెండెం నరేష్, శివరాం, శివ చారి, మురళి,శివ, దత్తు, మరియు హిందూ సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.