ఏపీ పోలీసు శాఖ ‘చేయూత’ పథకం అమలు జరుగుతున్న సంగతి విదితమే. పదవీ విరమణ పోందిన ఉద్యోగస్థులకు సిబ్బంది మొత్తం ఒక రోజు అలెవన్స్ కింద ‘చేయూత’ పథకాన్ని అందించడం జరుగుతూ వస్తోంది.
ఇందులో భాగంగా జిల్లా పోలీసు శాఖలో హోంగార్డుగా పనిచేస్తూ ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారణాసి రామారావుకు “చేయూత”గా హెూంగార్డుల ఒక రోజు అలెవన్స్ ను విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాజకుమారి ఆదేశాలతో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ రావు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసిన హోంగార్డులు ఉద్యోద విరమణ చేసినా లేదా ఏదైనా కారణాలతో మృతి చెందినా వారి కుటుంబాలను ఆర్ధికంగా అదుకొనేందుకు జిల్లాలో పనిచేస్తున్న హెూంగార్డులు తమ ఒక్క రోజు వేతన అలవెన్సును హెూంగార్డ్సు్ కుటుంబాలకు ఇచ్చేందుకు ముందుకు రావడం ఎంతో శుభ పరిణామమన్నారు.
ఇందులో భాగంగా ఏప్రిల్ నెలలో ఉద్యోగ విరమణ చేసిన హెూంగార్డు వారణాశి రామారావుకు, జిల్లాలో పనిచేస్తున్న హోగార్డుల ఒక్క రోజు డ్యూటీ అలవెన్సు చెక్ 3 లక్షల ను డీపీఓలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణ అందజేసారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, ఆర్.ఐ పి.నాగేశ్వరరావు, హో గార్డ్సు ఇన్ చార్జ్ ఆర్ఎస్ఎ కేశవరావు, ఆఫీసు సూపరింటెండెంట్ పి. కామేశ్వరరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.