29.7 C
Hyderabad
April 29, 2024 08: 55 AM
Slider ఆదిలాబాద్

మరణించిన హోం గార్డులకు ఆర్ధిక సాయం

Home Guard

విధి నిర్వహణలో మరణించిన హోంగార్డులకు నిర్మల్ జిల్లా ఎస్పీ సి శశిధర్ రాజు నేడు ఆర్ధిక సహాయం అందిచారు. జిల్లా సాయుధ దళా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హోంగార్డ్ కుటుంబ సభ్యులు అందుకున్నారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో హోంగార్డ్ లు వివిధ విభాగాలో సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. వీరిలో ఎవరైనా పదవి విరమణ చేసినా లేదా విధి నిర్వహణ సమయంలో మరణించినా సంబంధిత కుటుంబ సభ్యులకు హోంగార్డ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి కొంత సహాయం చేస్తామని అన్నారు.

నిర్మల్ యూనిట్ లో అనారోగ్యంతో మరణించిన ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల్ సుంకిడి గ్రామానికి చెందిన సిహెచ్.గోవింద్ రావు భార్య కమల బాయికు హోంగార్డ్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్ రావు, వెంకట్ రెడ్డి, నిర్మల్ డిఎస్పి ఉపేందర్ రెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, పట్టణ/సొన్ సిఐలు జాన్ దివాకర్, జీవన్ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ఐలు వెంకటి, కృష్ణ ఆంజనేయులు, ఎంటిఓ వినోద్, ఆర్ఎస్ఐ దేవేందర్, సాయుధ దళా సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

శాస్త్రోక్తంగా తిరుమలలో వైకుంఠ ద్వాద‌శి చక్రస్నానం

Satyam NEWS

ఎన్నికలు వస్తేనే కేసీఆర్ నోట పధకాల మాట

Bhavani

మద్యం ఉద్యోగుల్ని దోచుకుంటున్న రెడ్డి ఎంటర్ ప్రైజెస్

Satyam NEWS

Leave a Comment