కడప జిల్లా చిట్వేల్ మండలం అనుమపల్లె చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం రాజంపేట డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తనిఖీలు నిర్వహించారు. అక్కడ సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో మీడియా వారికి రేషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై తో పాటు పోలీసు సిబ్బంది, పాత్రికేయులు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ తో ఆదేశాలతో డిఎస్పీ లు అందరూ మీడియా వారికి జిల్లా అంతటా నిత్యావసర వస్తువులు అందజేసారని డీఎస్పీ నారాయణ స్వామి రెడ్డి తెలిపారు. రంజాన్ సందర్భంగా ఇమాం, మోస్క్యూస్ లకు గుర్తింపు కార్డులను అందజేశారు. కోవిడ్ -19విధి నిర్వహణ లో భాగంగా స్థానిక పోలీసులకు కాపర్ వాటర్ బాటిళ్లు, కళ్ళ అద్దాలను పంపిణీ చేశారు.