సుదీర్ఘ కాలం నుండి పేదలు ఎదుర్కొంటున్న ఇళ్ళ పట్టాల సమస్య రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ద్వారా నెరవేరింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ డివిజన్ రాజీవ్ నగర్ గుట్టలో నిర్వాసితులు 77 మందికి శాశ్వత ఇళ్ళ పట్టాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం పంపిణి చేశారు. అలాగే ఖమ్మం నగరంలోని 4వ డివిజన్ లో 77, 58వ డివిజన్ దొరన్నకాలనీ 127, 31వ డివిజన్ కాటన్ మార్కెట్ ప్రాంతంలో 138, స్థానిక నిర్వాసితులకు మంత్రి పువ్వాడ కృషితో 342 మందికి శాస్వత పట్టాలతో పేదల చిరకాల స్వప్నం నెరవేరింది. ఖమ్మం నగరంలో వివిధ ప్రాంతాలలో నివాసం ఉంటున్న 324 మంది నిర్వాసితులకు మంత్రి పువ్వాడ కృషితో పట్టాలు రావటం ద్వారా వారి కల నేరవేరింది.